అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం.. జగన్‌ను పలకరించిన రఘురామ కృష్ణరాజు.. జగన్ ఏమన్నారంటే?

-

ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభం అయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగం అనంతరం సభ వాయిదా పడింది. ఇదిలా ఉంటే.. అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పులివెందుల ఎమ్మెల్యే జగన్ మోహన్ రెడ్డి వద్దకు వెళ్లి పలకరించారు. హాయ్ జగన్.. అంటూ అసెంబ్లీలో జగన్ కూర్చున్న సీటు వద్దకు వెళ్లి రఘురామ పలుకరించారు. సమావేశాలు జరిగినన్ని రోజులు సభకు రావాలని జగన్ మోహన్ రెడ్డిని కోరాడు.. హాజరవుతానని జగన్ బదులిచ్చారు.

జగన్, రఘురామ మధ్య కొన్ని నిమిషాలు ఆసక్తికర చర్చ జరిగింది. కొద్ది సేపటి తరువాత జగన్ ముభావంగా ఉండటంతో రఘురామ అక్కడి నుంచి వచ్చేశారు. జగన్ చేతిలో చేయివేసి రఘురామ మాట్లాడినట్లు పలువురు సభ్యులు చెబుతున్నారు. దీంతో వారిద్దరి మధ్య ఏం చర్చ జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జగన్ తో మాట్లాడిన తరువాత పయ్యావుల కేశవ్ వద్దకు రఘురామ వెళ్లి.. తనకు జగన్ పక్కనే సీటు కేటాయించాలని కోరారు. దీంతో కేశవ్ నవ్వుతూ అలాగే అంటూ వెళ్లిపోవడం

Read more RELATED
Recommended to you

Exit mobile version