జగన్‌ దళిత ద్రోహి..హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే – వంగలపూడి అనిత

-

జగన్‌ దళిత ద్రోహి..హనుమాయమ్మది ముమ్మాటికీ రాజకీయ హత్యే అంటూ ఫైర్‌ అయ్యారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. కక్ష్య కట్టి హనుమాయమ్మను అతి కిరాతకంగా చంపారు..రాజకీయ అండదండలతోనే ఇంటి ముందే కన్న కూతురి ముందు హత్య చేశారని పేర్కొన్నారు. దళిత మహిళను చంపిన వ్యక్తి ఫోటోను కూడా పోలీసులు బయట పెట్టక పోవటం శోచనీయం అన్నారు.

ఎస్పీ, హోం మంత్రి, మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి, మహిళ కమిషన్ చైర్ పర్సన్.. అందరూ మహిళలై ఉండి తోటి మహిళ హత్య పట్ల కనీస సానుభూతి చూపించటం లేదని ఆగ్రహించారు. చంద్రబాబు, లోకేష్ గురించి మాట్లాడమంటే తిట్ల దండకం అందుకుంటారని…జిల్లాకు చెందిన దళిత మంత్రి దళిత ఆడబిడ్డ హత్య చేయబడితే స్పందించలేదని మండిపడ్డారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మంత్రి సురేష్ బయటకు వస్తే దళితులే చొక్కా చింపి కొడతారు.. ఇన్ ఛార్జ్ మంత్రి మేరుగ నాగార్జున కూడా దళితుడై ఉండి సానుభూతి వ్యక్తం చేయలేదని మండిపడ్డారు. హత్య చేస్తామని చెప్పి మరీ హనుమాయమ్మను హత్య చేశారు..ప్రభుత్వం హనుమాయమ్మ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించి.. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version