మార్చి, ఏప్రిలో లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు – సీఎం జగన్‌

-

మార్చి, ఏప్రిలో లోనే ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని సీఎం జగన్‌ కీలక ప్రకటన చేశారు. విజయవాడ లో వైసీపీ ఎన్నికల శంఖారావం పూరించింది. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ఇక్కడకు వచ్చిన అందరూ నా కుటుంబ సభ్యులు… నా సేనానులు…అందరికీ స్వాగతం పలుకుతున్నానని చెప్పారు.

AP assembly elections in March and April said CM Jagan

ఈ సభకు రాలేకపోయిన గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు అందరికీ అభినందనలు అని తెలిపారు. ప్రజలకు తొలి సేవకుడిని…మూడు రాజధానులను ప్రకటించాం…13 జిల్లాలను 26 జిల్లాలు చేశామన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా లంచాలు, వివక్ష లేకుండా పథకాలు అందించామని వివరించారు. వైఎస్ఆర్సీపీ తప్ప ప్రజల కిచ్చిన మాటను నిలబెట్టుకున్న పార్టీ దేశంలోనే లేదన్నారు. విద్య వైద్య రంగాల్లో వ్యవసాయ విప్లవాత్మక మార్పులు తెచ్చామని.. నామినేటెడ్ పదవుల్లో 50శాతానికి పైగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇచ్చామని గుర్తు చేశారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version