ఏపీలోని బాపట్లలో ఆటోను ఢీకొన్ని లారీ.. 5 గురు మృతి

-

ఏపీలోని బాపట్ల సంతమాగులూరు వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఆటోని లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఏకంగా 5 గురు మరణించగా మరో నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇక క్షతగాత్రులను నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. సంఘటనా స్థలంలో ముగ్గురు మృతి, చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు.

auto lorry accident

క్షతగాత్రులు నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక మృతులు గుంటూరు నల్లపాడుకు చెందిన కేటరింగ్ వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. ఆటో మార్కాపురం వెళ్ళి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. మృతుల వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. బాపట్ల సంతమాగులూరు వద్ద జాతీయ రహదారిపై జరిగిన ఈ రోడ్డు ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version