అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవడం ఒక పండగే – బాలయ్య

-

అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవడం ఒక పండగే అన్నారు నందమూరి బాలయ్య. హిందూపురం నియోజక వర్గంలో అన్న క్యాంటీన్లు ప్రారంభించిన ఎమ్మెల్యే బాలకృష్ణ అనంతరం మాట్లాడారు. ఈ సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. పేదల ఆకలి తీర్చేందుకు అప్పట్లో ఎన్టీఆర్ రెండు రూపాయలకే కిలో బియ్యం ఇచ్చారన్నారు.

Balakrishna started the Anna Canteen in Hindupuram

హిందూపురం ప్రభుత్వాసుపత్రి ఆవరణంలో అన్న క్యాంటీన్ ప్రారంభించారు ఎమ్మెల్యే బాలకృష్ణ. అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం లో ఎమ్మెల్యే బాల కృష్ణతో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ చేతన్. అనంతరం అల్పా హారాన్ని స్వయంగా వడ్డించారు టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే బాల కృష్ణ. నిన్న సీఎం చంద్రబాబు గుడివాడలో అన్న క్యాంటీన్ ప్రారంభించారని గుర్తు చేశారు నందమూరి బాలయ్య.

ఇవాళ ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా 99 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయన్నారు. పేదలకు అన్న క్యాంటీన్ కడుపు నింపుతుందని… అన్నా క్యాంటీన్లు తిరిగి ప్రారంభం అవడం ఒక పండగ లాంటిదని తెలిపారు. సీఎం చంద్రబాబుకు హిందూపురం అంటే ప్రత్యేక అభిమానమని… ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ప్రజలే ఎన్నుకున్నారని తెలిపారు. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version