ఏపీలో వచ్చేది బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వమే – సీఎం రమేష్

-

ఏపీలో వచ్చేది బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వమేనని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఉదయం పది గంటలకు ఏపీ బీజేపీ నేతల కీలక భేటీ కానుంది. ఈ సందర్భంగా పొత్తులపై బీజేపీ ఎంపీ సీఎం రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై ఇప్పటికే అభిప్రాయ సేకరణ పూర్తైందన్నారు. ఏపీ ముఖ్య నేతలమంతా పొత్తులపై మా అభిప్రాయాలు అధిష్టానానికి చెప్పేశామని…పొత్తులపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అంటూ వ్యాఖ్యానించారు.

BJP MP CM Ramesh’s key comments on alliances

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర స్థాయిలో పొత్తులపై చెప్పేదేం ఉండదని…పార్టీలో కొంత మంది నేతలు పొత్తులపై అనవసరంగా కామెంట్లు చేస్తున్నారని ఆగ్రహించారు. పొత్తులపై మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పినా కొందరు నేతలు వినడం లేదని చెప్పారు. ఇవాళ్టీ భేటీలో పొత్తులపై మాట్లాడే నేతలను కట్టడి చేయాలని కోరతామని..వివరించారు. ఏపీలో వచ్చేది బీజేపీ కూటమితో కూడిన ప్రభుత్వమేనని.. ఆ కూటమిలో ఎవరెవరు ఉండాలో జాతీయ నాయకత్వం డిసైడ్ చేస్తుందన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్.

Read more RELATED
Recommended to you

Latest news