చంద్రబాబు తన బినామీల కోసం యువత బతుకులను బుగ్గిపాలు చేశారు – కరణం ధర్మశ్రీ

-

టిడిపి అధినేత నారా చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ. అనకాపల్లిలో కరణం ధర్మశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. 3300 కోట్ల స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హస్తం ఉందని ఆరోపించారు. సిమెన్స్ కంపెనీ పేరుతో ఉపాధి మరియు శిక్షణ పేరుతో గత ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందని.. షెల్ కంపెనీల ద్వారా 371 కోట్లు చంద్రబాబు అండ్ కో దోచుకుందని ఆరోపించారు.

ఒప్పందం ప్రకారం ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పది శాతం నిధులను చంద్రబాబు నొక్కేశాడని ఆరోపించారు. తన బినామీలకు ప్రభుత్వ ఖజానా నుంచి 371 కోట్లు మళ్ళించాడని అన్నారు కరణం ధర్మశ్రీ. తన బినామీల కోసం యువత బతుకులను బుగ్గిపాలు చేసిన ఘనుడు చంద్రబాబు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version