సుప్రీం కోర్టులో మరోసారి చంద్రబాబుకు నిరాశే..!

-

సుప్రీం కోర్టులో మరోసారి చంద్రబాబుకు నిరాశే అంటూ వైసీపీ ప్రచారం చేస్తోంది. అయితే.. దీనిపై రఘురామకృష్ణ రాజు కౌంటర్‌ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ రిమాండ్ రిపోర్టును స్క్వాష్ చేయాలని కోరుతూ నారా చంద్రబాబునాయుడు గారు సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మూడవ తేదీనే అత్యున్నత ధర్మాసనం విచారించనుందని రఘురామకృష్ణ రాజు గారు తెలిపారు.

A team of CID officers interrogating Chandrababu

ఈ నెల ఆరవ తేదీకి కేసు విచారణ వాయిదా పడింది అంటూ తమ వైసీపీ పార్టీ సోషల్ మీడియా బ్యాచ్ తప్పుడు ప్రచారాన్ని చేస్తోందన్నారు. మూడవ తేదీనే సప్లిమెంటరీ లిస్టులో మూడవ కేసుగా ఇప్పటికే కోర్టులో చంద్రబాబు నాయుడు గారి కేసు లిస్ట్ అయ్యిందన్నారు. మూడవ తేదీన సుప్రీంకోర్టులో నారా చంద్రబాబు నాయుడు గారికి స్కిల్ డెవలప్మెంట్ స్కీం స్కామ్ కేసు నుండి ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుందన్న ఆశాభావాన్ని రఘురామకృష్ణ రాజు గారు వ్యక్తం చేశారు. దీనితో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఆశాభంగం తప్పదన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version