రాజశేఖర్ రెడ్డి కుటుంబం.. మన కోసమే రాజకీయాల్లోకి వచ్చింది – చెల్లుబోయిన వేణు

-

రాజశేఖర్ రెడ్డి కుటుంబం.. మన కోసమే రాజకీయాల్లోకి వచ్చిందని ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు పేర్కొన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ కుంభా రవి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి రాజన్న దొర, మంత్రులు చెల్లుబోయిన వేణు, మేరుగ నాగార్జున, ప్రభుత్వ సలహాదారు సజ్జల, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భం గా ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ ఇద్దరూ గిరిజనులకి పది లక్షల ఎకరాల పంచడం అసాధారణం అని వెల్లడించారు.

ఎండమావిగా ఉన్న సామాజిక న్యాయాన్ని సీఎం వైఎస్ జగన్ నిండు కుండలా చేశారని..బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికే సీఎం వైఎస్ జగన్ పాదయాత్ర చేసారని పేర్కొన్నారు. రాజకీయాల్లో సీఎం వైఎస్ జగన్ కారణజన్ముడని కొనియాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version