నారా రోహిత్ శిరీషను ఆశీర్వదించిన సీఎం చంద్రబాబు

-

సినీ నటుడు నారా రోహిత్-శిరిష నిశ్చితార్ధం హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు  దంపతులతో పాటు నారా, నందమూరి ఫ్యామిలీ  కుటుంబ సభ్యులు, పలువురు రాజకీయ, సినీ నటులు హాజరయ్యారు. నిశ్చితార్ధం చేసుకున్న నారా రోహిత్-శిరీషలను చంద్రబాబు నాయుడు-భువనేశ్వరి ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. నారా రోహిత్ నిశ్చితార్ధం కార్యక్రమ ఏర్పాట్లను నారా భువనేశ్వరి స్వయంగా పర్యవేక్షించారు.

నారా రోహిత్ 2019లో ‘బాణం’ సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విభిన్నమైన సినిమాల్లో నటించారు నారా రోహిత్. ఇటీవల ప్రతినిధి-2 అంటూ ఓ  సినిమా చేశారు. ఈ సినిమా లో శిరీష హీరోయిన్ గా నటించారు. ఆ సమయంలో వీరు  ఇద్దరూ ప్రేమ లో పడ్డారు. దీంతో ఇరు కుటుంబాలను ఒప్పించి.. వీరు  పెళ్లికి రెడీ అయ్యారు. ఈ తరుణంలో ఇవాళ  ఆదివారం శుభ సందర్భంగా  హైదరాబాద్ లో  నిశ్చితార్థం కార్యక్రమం జరిగింది. ఇందుకు పలువురు హాజరయ్యారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version