జూన్ 15న కుప్పంలో డిజిటల్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఫేజ్-2లో భాగంగా చిత్తూరులోని 30 మండలాల్లోనూ, అనంతరం రాష్ట్రమంతా అమలు చేస్తామని వెల్లడించారు. హెల్త్ రికార్డులను డిజిటల్ లాకర్లో ఉంచనున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. జీఎస్డీపీపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

2047 నాటికి 15 శాతం వృద్ధి రేటు సాధిస్తే జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి) రూ.347 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం 15 శాతం వృద్ధి సాధిస్తే 2047కి తలసరి ఆదాయం రూ.58 లక్షలకు చేరుతుందన్నారు. 2014-19 మధ్య 13.5 శాతం వృద్ధి రేటు సాధిస్తే, 2019-24లో వృద్ధిరేటు 10.3 శాతానికి పడిపోయిందని.. దీంతో రూ.7 లక్షల కోట్ల జీఎస్డీపీ నష్టపోయినట్టు వెల్లడించారు.