లండన్ నుంచి ఏపీకి వస్తున్న సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి ఏపీకి రానున్నారు. దాదాపు 15 రోజులపాటు లండన్ పర్యటనకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి… ఇవాళ నేరుగా ఏపీకి వచ్చేస్తున్నారు. కోర్టు అనుమతితో మే 17వ తేదీన… లండన్ వెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులు. అయితే అక్కడ రెండు వారాల పాటు… తన భార్య అలాగే పిల్లలతో చాలా జాలిగా గడిపారు జగన్మోహన్ రెడ్డి.

అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో…. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏపీకి రానున్నారు. లండన్ నుంచి నేరుగా గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తారు జగన్. అనంతరం గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తాడేపల్లిగూడెం కి వెళ్తారు. ఇక రేపు వైసిపి కార్యకర్తలతో అలాగే నేతలతో జగన్మోహన్ రెడ్డి కీలక సమావేశం ఉండనుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version