సీఎం జగన్ పగటి కలలు కంటున్నారు : అచ్చెన్నాయుడు

-

సీఎం జగన్ పగటి కలలు కంటున్నారు ఏపీ టీడీపీ అధ్యక్షుడు  అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. విశాఖ పట్నంలో సీఎం జగన్ మరోసారి ప్రమాణ స్వీకారం చేయాలని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. వైజాగ్ పై అంత ప్రేమ ఉంటే.. ఎందుకు పరదాల చాటున తిరుగుతున్నారు అని ప్రశ్నించారు. ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లే సత్తా జగన్ కి లేదు.

గత ఐదేళ్లలో విశాఖలో సీఎం విధ్వంసం సృష్టించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి తరలిపోయాయి అని విరుచుకుపడ్డారు అచ్చెన్నాయుడు. మరోవైపు  సీఎం జగన్ ఇవాళ విశాఖలో నిర్వహించిన భవిత కార్యక్రమంలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని అలాగే ఉంటుందని.. అమరావతి శాసన రాజధాని అని తెలిపారు. విశాఖలో బెంగళూరు కంటే వనరులు బాగున్నాయని తెలిపారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version