మూడు రాజధానులపై సీఎం జగన్ కీలక ప్రకటన

-

స్వాతంత్ర్య దినోత్సవ ఉపన్యాసంలో మూడు రాజధానుల అంశాన్ని ప్రస్తావించారు సీఎం జగన్ మోహన్‌ రెడ్డి.భారత 75 వ స్వాతంత్ర్య దినోత్సవం, ‘స్వతంత్ర భారత వజ్రోత్సవాల’ సందర్భంగా జాతీయ జెండా ను ఆవిష్కరించారు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. మ పరిపాలన వికేంద్రీకరణ లో భాగంగా 13 జిల్లాలను మరో 13 జిల్లాలుగా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

రాజధాని స్థాయిలో పరిపాలన వికేంద్రీకరణే మా విధానమని పేర్కొన్నారు. ప్రాంతీయ ఆకాంక్షలకు, ప్రాంతాల ఆత్మ గౌరవానికి, సమతౌల్యాన్నికి ఇదే పునాది అని.. ఆ దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యానికి ప్రతీక. పింగళి వెంకయ్య రూపొందించిన జెండా భారతీయుల గుండె అని తెలిపారు. ప్రపంచంతో పోటీపడి ప్రగతిని సాధిస్తున్నాం. ఆహార ధాన్యాల లోటును దేశం అధిగమించిందన్నారు సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి. ప్రపంచ ఫార్మారంగంలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. ప్రపంచానికి అవసరమైన ఔషధాలను అందిస్తున్నామన్నారు ఏపీ సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version