వాలంటీర్లపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ డీజీపీకి ఫిర్యాదు

-

అమరావతి: మంగళవారం డీజీపీని కలిశారు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం. వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యలను తప్పు పడుతూ డీజీపీకి ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరారు వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు పోతుల సునీత. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. వాలంటరీ వ్యవస్థపై పవన్ వ్యాఖ్యలు హేయమైనవని అన్నారు. నరేంద్ర మోడీ సైతం వాలంటరీ వ్యవస్థను మెచ్చుకున్నారని.. కరోనా సమయంలో వాలంటీర్లు అందించిన సేవలు దేశానికే ఆదర్శం అన్నారు. చంద్రబాబు, లోకేష్ లకు రాజకీయాలు చేసే దమ్ములేక పవన్ ను అడ్డం పెట్టుకుంటున్నారని మండిపడ్డారు.

పవన్ టీడీపీ కోసమే రాజకీయం చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ ల జేబు సంస్థగా పవన్ పని చేస్తున్నాడని దుయ్యబట్టారు. చంద్రబాబు,లోకేష్, పవన్ ఏపీకి టూరిస్టులు మాత్రమనని.. కరోనా సమయంలో మీరంతా ఏమైపోయారని ప్రశ్నించారు పోతుల సునీత. పవన్ కళ్యాణ్ కు మహిళలంటే గౌరవం లేదన్నారు. వాలంటీర్లను చాలా చిన్న చూపు చూస్తున్నాడని.. తన వ్యక్తిగత జీవితంలో మహిళలను మోసం చేసిన మోసగాడు పవన్ అంటూ మండిపడ్డారు. అందుకే వాలంటీర్ల పట్ల పవన్ చాలా నీచంగా మాట్లాడుతున్నాడన్నారు. పవన్ ను రెండు చెప్పులతో కొట్టడానికి వాలంటీర్లంతా సిద్ధంగా ఉన్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version