ఇవాళ కడప జిల్లాకు జగన్… 3 రోజులు అక్కడే మకాం

-

Former CM YS Jagan will visit Kadapa district: కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు మాజీ సీఎం వైఎస్ జగన్. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకులకు హాజరుకానున్న జగన్…ఈ మేరకు కడప జిల్లాలో మూడు రోజులు పర్యటించనున్నారు. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలను ఇడుపులపాయలో ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Former CM YS Jagan will visit Kadapa districts

దీంతో మూడు రోజులు జిల్లాలోనే మకాం వేయనున్న జగన్… కడపకు బయలు దేరారు. ఈ నెల 8వ తేదీన మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఉన్న నేపథ్యంలో ఇడుపులపాయకు వైఎస్‌ షర్మిల కూడా వచ్చే ఛాన్స్‌ ఉంది.

అటు వైసీపీ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది వైసిపి పార్టీ. ఈ మేరకు వైసిపి పార్టీ ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి సభ్యులు రామకృష్ణారెడ్డి కీలక ప్రకటన చేశారు. జులై 8వ తేదీన అంటే రేపు… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైయస్సార్…విగ్రహానికి నివాళులు అర్పించి ఆ తర్వాత సేవా కార్యక్రమాలను చేయాలని పిలుపునిచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version