తెలుగు భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదు – వెంకయ్య నాయుడు

-

తెలుగు భాషను మర్చిపోయిన వాడు మనిషే కాదన్నారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నేను తెలుగు లోనే మాట్లాడతా..తెలుగు వచ్చిన వాళ్ళ ముందు ఇంగ్లీషు లో మాట్లాడటం ఎందుకో నాకు అర్ధం కాదన్నారు. మాతృ భాషను మర్చిపోయిన వాడు మనిషి కాదని.. కోట్లాది జీవరాశులలో చైతన్య వంతమైన జీవరాశి, మానవ జాతి ది అంటూ వ్యాఖ్యానించారు.

Former Vice President Venkaiah Naidu comments

కొత్త సచ్చిదానంద మూర్తి సమాజం లో చైతన్యం తీసుకువచ్చిన వ్యక్తి…ఆంగ్లం లో మాట్లాడే నాయకులు గొప్పవాళ్ళు కాదు…. మన దేశ నాయకులు చత్రపతి శివాజీ, జాన్సి లక్ష్మీబాయి,కొమరం భీం లాంటి మాతృ భాష మాట్లాడే నాయకులే గొప్పవాళ్ళు అని తెలిపారు. మాతృ భాషలో చదువుకున్న మహిళ ఈ రోజు దేశ మొదటి మహిళ గా ఉన్నారు..కాన్వెంట్ మొహం చూడని మోడీ ప్రపంచదేశాల మన్నన పొందుతున్న మన దేశ ప్రధాని గా ఉన్నారని వివరించారు. మాతృ భాష ను ప్రేమించండి,సోదర భాష ను గౌరవించండి, అంతర్జాతీయ భాషని నేర్చుకోండని తెలిపారు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version