వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ రిమాండ్ పొడగింపు..!

-

టీడీపీ కేంద్ర కార్యాలయం పై జరిగిన దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ నందిగం సురేష్ పోలీస్ కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండు రోజుల పాటు గుంటూరు జిల్లా జైలులో విచారణ  చేశారు. అయితే తాజాగా మాజీ ఎంపీ నందిగం సురేష్ కి రిమాండ్ ను పొడిగించారు. మరో 14 రోజుల పాటు అనగా అక్టోబర్ 3 వరకు రిమాండ్ పొడిగించింది మంగళగిరి కోర్టు.

రెండు రోజుల విచారణలో భాగంగా సురేష్ కి 45 ప్రశ్నలు వేసి సమాధానం రాబట్టారు పోలీసులు. అత్యధిక ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోయినా.. కేసు దర్యాప్తులో కీలకమైన నాలుగైదు ప్రశ్నలకు అవసరమైన సమాధానం చెప్పినట్టు సమాచారం. మరోవైపు  తుళ్లూరు పోలీసులు వేసిన పిటి వారెంట్ ని  రిజెక్ట్ చేసింది మంగళగిరి కోర్టు. మరియమ్మ అనే మహిళ మృతిపై, లోతైన దర్యాప్తు చేసి, ఆమె మృతి లో నందిగం సురేష్ పాత్రపై సరైన ఆధారాలు సమర్పించాలని, తుళ్లూరు పోలీసులను ఆదేశించింది మంగళగిరి కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version