ఏపీ వాలంటీర్లకు శుభవార్త..ఇకపై నెలకు రూ.15వేల జీతం !

-

ఏపీలో ఎన్నికల హీట్‌ మొదలైంది. ఈ నేపథ్యంలోనే, జగన్‌ సర్కార్‌ అన్ని సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే, ఏపీలో వాలంటీర్లకు శుభవార్త చెప్పారు ఏపీ మంత్రి పినిపే విశ్వరూప్. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తిరిగి అధికారంలోకి రాగానే గ్రామ వాలంటీర్లకు రూ. 15వేల వేతనం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు.

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరంలో గ్రామ వాలంటీర్లు, సచివాలయ కన్వీనర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. కష్టపడి పని చేసి రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని సూచించారు. మరో పార్టీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను ఉద్యోగాల నుంచి తొలగించడం ఖాయమని హెచ్చరించారు. సంక్షేమ ఫలాలు పొందని లబ్ధిదారులను ఆరోనెలలకు ఒకసారి గుర్తిస్తూ, వారికి పథకాలు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధి చాటతోందన్నారు మంత్రి విశ్వరూప్.

Read more RELATED
Recommended to you

Exit mobile version