చంద్రబాబు సీఎంగా ఉంటే..శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టే – హోం మంత్రి అనిత

-

చంద్రబాబు సీఎంగా ఉంటే..శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టే అన్నారు హోం మంత్రి అనిత. సైకో జగన్ పాలనలో శాంతి భద్రతలను ఎలా వాడుకున్నారో అందరికీ తెలుసు….కొన్ని అరాచక శక్తులు మా ప్రభుత్వ హయాంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు పాలనలో శాంతి భద్రతలు అదుపులో ఉంటాయని ప్రజలకు అందరికీ తెలుసు అని.. గత ఐదేళ్లలో టీడీపీ, బీజేపీ, జనసేన నేతలతో పాటు సాధారణ ప్రజలు కూడా ఇబ్బందులు పడ్డారని వివరించారు హోం మంత్రి వంగలపూడి అనిత.

గత ఐదేళ్లుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి నేతలకే ఇబ్బందులు ఎదురయ్యాయి….ప్రజలిచ్చిన మద్దతును ఓర్చుకోలేక పోతున్నారని పేర్కొన్నారు. రెండు పార్టీల వ్యక్తులకు అప్పీల్ చేస్తున్నా అనవసరంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదు…. చట్టం ఎవరికైనా ఒక్కటే టీడీపీ, వైసీపీ నేతలు, పార్టీల కార్యకర్తలు సంయమనం పాటించాలని కోరారు హోం మంత్రి వంగలపూడి అనిత. జగన్ రాష్ట్రపతికి, హోం మంత్రికి రాసే లేఖలో తన బాబాయ్ హత్య కేసు, డ్రైవర్ సుబ్రమణ్యాన్ని చంపి డోర్ డెలివరీ చేసిన కేసు సహా వివిధ ఘటనలను కూడా ప్రస్తావించాలని తెలిపారు. గతం ప్రభుత్వ హాయంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయ్యింది…. ఇప్పుడిప్పుడే పరిస్థితి మారుతోందని పేర్కొన్నారు.దేనికైనా సమయం వస్తుంది. అన్ని అంశాలు చట్టపరంగా చర్యలు ఉంటాయి…. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారంటేనే సగం శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్టే అని తెలిపారు హోం మంత్రి వంగలపూడి అనిత.

Read more RELATED
Recommended to you

Exit mobile version