జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు అయితే.. మన వాలంటీర్లు తులసి మొక్కలు : సీఎం జగన్

-

జన్మభూమి కమిటీలు గంజాయి మొక్కలు అయితే.. మన వాలంటీర్లు తులసి మొక్కలు అని సీఎం జగన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో ఏర్పాటు చేసిన వాలంటీర్ల అభినందన సభలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఇంట్లో కూర్చుంటారు. ఇతర రాష్ట్రాల్లో ఇచ్చిన మేనిఫెస్టో తెప్పించుకుంటారు. వాళ్ల మెనిఫెస్టో బాగా పని చేసినవి తీసుకొని కిచిడీ తయారు చేస్తారని పేర్కొన్నారు.

జగన్ మాదిరిగా బటన్ నొక్కితే  రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెప్పారు చంద్రబాబు. ప్రజలను మోసం చేసేందుకు ఆరు గ్యారెంటీలు అని.. ఇది శాంపిల్ మాత్రమే.. ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి.. ఏదేదో చెబుతాడని పేర్కొన్నారు. ఎప్పుడూ జరగని విధంగా అభివృద్ధి చేశాడు మీ బిడ్డ జగన్. ఆరు హామీలు అంటూ కొత్త మేనిఫెస్టో ప్రకటించాడు చంద్రబాబు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, సబ్సీడీ మీద బియ్యం ఇచ్చే కార్యక్రమం, ఆరోగ్య శ్రీ, గోరుముద్ద, విద్యాదీవెన, వసతి దీవెన తదితర కార్యక్రమాలను జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version