గుర్తుపట్టలేని స్థితిలో జేసీ దివాకర్ రెడ్డి!

-

గుర్తుపట్టలేని స్థితిలో జేసీ దివాకర్ రెడ్డి దర్శనం ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ మీడియా ముందుకు వచ్చారు జేసీ దివాకర్ రెడ్డి. ఈ కొత్త ఏడాదిలో ప్రజలంతా ఆర్థికంగా బలపడి సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కుటుంబాలలో జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీ ఒకటి. జెసి దివాకర్ రెడ్డి పేరు చెప్పగానే ఏపీలో రాజకీయంగా తెలియని వారు అంటూ ఉండరు. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వరసత్వంతో జెసి దివాకర్ రెడ్డి 1985 నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా గెలిచారు.

jc

2004 – 2006లో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా పనిచేశారు జేసి. 2010 కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో జెసి దివాకర్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు లభించలేదు. ఇక 2011లో ప్రొటెమ్ స్పీకర్ గా పనిచేశారు జేసీ. ఆ తరువాత 2014 మేలో అనంతపురం నియోజకవర్గం నుంచి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత అనంతపురం పార్లమెంటు అభ్యర్థిగా జెసి దివాకర్ రెడ్డి తనయుడు జెసి పవన్ రెడ్డి పోటీ చేసి ఓడిపోయారు. ఇలా సీమ రాజకీయాలలో వెలుగు వెలిగిన జేసీ దివాకర్ రెడ్డి ఇప్పుడు పూర్తిగా మారిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version