ఏపీ రాజకీయాలపై మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి. నేడు కార్మిక దినోత్సవం సందర్భంగా రవీంద్రభారతిలో తెలంగాణ కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకలలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని పట్టించుకునేది కేసీఆర్ మాత్రమేనని అన్నారు. పోలవరం కట్టేది, విశాఖ ఉక్కు పరిశ్రమలు కాపాడేది కూడా కేసీఆర్ మాత్రమేనని వ్యాఖ్యానించారు మల్లారెడ్డి.

అంతేకాదు ఏపీలో కుల రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. అక్కడ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోవడం పూర్తిగా మానేసిందని.. కమ్మ, కాపు, రెడ్డి అంటూ ఏపీలో అందరూ కుల రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అందుకే పక్క రాష్ట్రాలలో కేసీఆర్ సీఎం కావాలని కోరుకుంటున్నారని.. కేసీఆర్ ని ఎన్నుకుంటే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version