ఎల్లకాలం మీ ఆటలు సాగవు..బిడ్డా జాగ్రత్త – మిథున్‌ రెడ్డి వార్నింగ్‌

-

Mithun Reddy: పుంగనూర్‌ అల్లర్లపై రాజంపేట వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎల్లకాలం మీ ఆటలు సాగవు..బిడ్డా జాగ్రత్త అని మిథున్‌ రెడ్డి వార్నింగ్‌ ఇచ్చారు. ప్రశాంతంగా ఉన్న పుంగనూరు నియోజకవర్గంలో ఘర్షణ వాతావరణం సృష్టించారని మండిపడ్డారు. రాళ్ళతో, మారణాయుధాలుతో ఈరోజు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని నిప్పులు చెరిగారు.

Mithun Reddy Warning

సిఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డైరెక్షన్ లోనే ఈరోజు పుంగనూరు లో దాడులు జరుగుతున్నాయని ఆరోపణలు చేశారు. పుంగనూరు నియోజకవర్గం అభివృద్ధి అడ్డుకోవాలని కుట్రలో భాగమే అన్నారు. 5 వేల కోట్లతో ఎలక్ట్రికల్ కారు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే, దాన్ని రాకుండా కుట్రలు చేస్తున్నారని ఆగ్రహించారు.
ఎల్లకాలం మీ ఆటలు సాగవు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. నా పార్లమెంట్ నియోజకవర్గంలో పర్యటించే వాతావరణం లేకుండా దాడులు చేస్తున్నారని నిప్పులు చెరిగారు రాజంపేట వైసీపీ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version