Mudragada: ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలోకి ముద్రగడ !

-

Mudragada: ఎలాంటి షరతులు లేకుండానే వైసీపీలోకి ముద్రగడ పద్మనాభం వెళ్లునున్నారట. ఇక కాసేపట్లో కిర్లంపూడి ముద్రగడ నివాసానికి వైసిపి నేతలు వెళ్లనున్నారు. అటు ముద్రగడ నివాసానికి ఆయన అనుచరులు చేరుకుంటున్నారు. ముద్రగడ తో వైసీపీ ఉభయగోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్లు మిధున్ రెడ్డి, బోస్ సమావేశం కానున్నారు. అలాగే.. ముద్రగడ ఇంటికి వైసీపీ జిల్లా కాపు ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు రానున్నారు.

ఈ సందర్భంగా ముద్రగడను పార్టీలోకి ఆహ్వానించనుంది వైసీపీ బృందం. ప్రస్తుతానికి షరతులు లేకుండానే వైసీపీలోకి ముద్రగడ వెళ్లనున్నారట. అవకాశం, అవసరాన్ని బట్టి పిఠాపురం స్థానం పరిశీలించే యోచనలో అధికార పార్టీ ఉంది. అలాగే..ముద్రగడ కుమారుడికి నామినేటెడ్ పదవి హామీ ఇచ్చిందట వైసీపీ. ఇక వచ్చే వారంలో సీఎం జగన్‌ సమక్షంలో పార్టీలో ముద్రగడ పద్మనాభం కుటుంబం చేరనుందట.

Read more RELATED
Recommended to you

Exit mobile version