లైంగిక దాడులకు గురైన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు – జగన్‌

-

లైంగిక దాడులకు గురైన బాధిత కుటుంబాలకు రూ.10 లక్షలు అంటూ ప్రకటించారు ఏపీ మాజీ సీఎం జగన్‌. బాధిత కుటుంబాలకు వైసీపీ తరపున రూ. 10 లక్షలు ప్రకటించారు వైఎస్ జగన్. టీడీపీ ప్రభుత్వంలో లైంగిక దాడులకు గురైన బాధిత కుటుంబాలకు వైఎస్సార్సీపీ ఆర్థిక సాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఇవాళ లైంగిక దాడులకు గురైన కుటుంబాలను పరామర్శించారు జగన్‌.

jagan

ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ..ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం లో పరిస్థితి ఎలా ఉందో నా దళిత చెల్లి మరణం చూస్తే అర్ధం అవుతుందన్నారు. వైసిపి ప్రభుత్వం లో దిశ చట్టం రక్షణగా ఉండేదని వెల్లడించారు. ఫోన్ కదిపితే పోలీసులు రక్షణ గా ఉండేవారు..కానీ రాష్ట్రం లో అధ్వాన్న పరిస్థితి ఏర్పడిందని ఆగ్రహించారు.
తప్పు చేసిన వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఐతే చాలు ప్రభుత్వం నిందితులకు రక్షణ గా ఉంటుందని తెలిపారు. నిందితుడు నవీన్ టిడిపి కి చెందిన వాడు…పని చేస్తున్న సహన ను కారు ఎక్కించుకుని వెళ్లి దారుణంగా హత్య చేశారని ఫైర్అయ్యారు. నవీన్ ఒక్కడే కాదు ఇంకొందరు కూడా ఈ దాడి లో పాల్గొన్నారని ఆరోపణలు చేశారు జగన్‌.

Read more RELATED
Recommended to you

Exit mobile version