పెద్దిరెడ్డి ఎమ్మెల్యే పదవికి ఎసరు.. హైకోర్టు నోటీసులు జారీ !

-

పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి మరో ఊహించని షాక్‌ తగిలింది. పెద్దిరెడ్డి సహా… పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర హై కోర్టు. ఇవాళ పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డినీ అనర్హుడిగా ప్రకటించాలన్న పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్ ను బొడే రామచంద్ర యాదవ్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు వాదనలు హైకోర్టు సీనియర్ న్యాయవాది వై వి రవి ప్రసాద్, ఉమేష్ చంద్ర వినిపించారు.

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎన్నికల అఫిడవిట్ లో తన భార్యపై ఉన్న 145 స్థిరాస్తుల వివరాలు తెలుపలేదని న్యాయమూర్తికి తెలిపారు పిటిషనర్ తరఫు న్యాయవాదులు. ఈ తరుణంలోనే… పెద్దిరెడ్డి సహా… పుంగనూరులో పోటీ చేసిన అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది హైకోర్టు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నీ ఎందుకు అనర్హుడిగా ప్రకటించకూడదో తెలుపాలని పుంగనూరు లో పోటీ చేసిన అభ్యర్థులు కౌంటర్ వేయాలని న్యాయస్థానం తెలిపింది. తదుపరి విచారణ సెప్టెంబర్ 9 కి వాయిదా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version