రాజశ్యామల యాగం ఫలితంగానే రాష్ట్రానికి పెండింగ్ నిధులు – మంత్రి కొట్టు

-

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల నిర్వహించిన లక్ష్మీరాజ శ్యామల యాగం చేసిన ఫలితంగా అనుకూల పరిస్థితులు వచ్చాయన్నారు మంత్రి కొట్టు సత్యనారాయణ. యాగం ఫలితంగానే ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న నిధులు ఇప్పుడే వచ్చాయన్నారు. ఇది యజ్ఞఫలితమనే చెప్పటానికి దేవదాయశాఖ మంత్రిగా చొరవ తీసుకుంటున్నానన్నారు. శ్రీశైల క్షేత్రంలో కుంభాభిషేకం చేసేందుకు సంకల్పించినా ఉష్ణోగ్రతలు, వివిధ పరిస్థితుల కారణంగా వాయిదా వేశామన్నారు.

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కేంద్రంతో సత్సంబంధాలు నెరుపుతోందన్నారు. పీఠాధిపతుల సూచనల మేరకు కార్తీక మాసంలో శ్రీశైలంలో కుంభాభిషేకం నిర్వహిస్తామని తెలిపారు. కేంద్రం విభజన హామీల్లో భాగంగా ఇవ్వాల్సిన రెవెన్యూ లోటుతో పాటు ఇతర నిధులను ఇవ్వకుండా జాప్యం చేస్తూ వచ్చిందని.. కానీ తాజాగా పదివేల కోట్ల మీద రెవెన్యూ లోటు నిధులను విడుదల చేసిందని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version