5 ఏళ్ల బాలుడు తేజ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు

-

5 ఏళ్ల బాలుడు తేజ అనుమానాస్పద మృతి కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. విశాఖ పెందుర్తి లెండి వనం లోని స్విమ్మింగ్ పూల్ లో బాలుడు మృతి చెందాక ఓనర్ భాను కుమార్ కి సమాచారం ఇచ్చాడు వాచ్ మెన్ నారాయణ. లెండి వనం నిర్మాణం సమయంలో స్థానిక నాయకులతో కలసి ఓ స్థలం కబ్జాకు యత్నించాడు ఓనర్ భాను కుమార్.

లెండి వనం రిసార్ట్ కి పక్కనే ఉన్న స్థలం పై కన్ను ఉండటంతో బాలుడు మృత దేహాన్ని ఆ స్థలం లో పడేయాలని ఆదేశించాడు. ఓనర్ చెప్పినట్టు ఆ బాలుడు మృత దేహాన్ని రాత్రి సమయంలో ఎవరు చూడకుండా పనస చెట్టు వద్ద పడేశాడు వాచ్ మెన్ నారాయణ. ఆ విధంగా మృత దేహం పడేస్తే స్థలం యజమాని తక్కువ రేటు కి అమ్మకం జరుపుతారు అని ఆలోచన పన్నిట్టు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే వాచ్ మెన్ నారాయణ పై కేసు నమోదు చేసిన పోలీసులు… .రిసార్ట్ ఓనర్ భాను కుమార్ హైదరాబాద్ లో ఉండటంతో విశాఖ కి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version