బాబ్జీ.. జైలు డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారు : ధూళిపాళ్ల నరేంద్ర

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలు ఉన్న విషయం తెలిసిందే. అయితే చంద్రబాబు ప్రాణాలకు రాజమండ్రి జైలులో ప్రమాదం ఉందని టీడీపీ సీనియర్ నేత దూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. చంద్రబాబు ఆరోగ్యం, భద్రత విషయాల్లో అధికార యంత్రాంగం వ్యవహరిస్తున్న తీరు పలు అనుమానాలకు తావు ఇస్తోందన్నారు. తాజాగా ఆయన గుంటూరులోని టీడీపీ కార్యాలయంలో దూళిపాళ్ల నరేంద్ర మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబు అరెస్ట్ కి ముందే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బంధువు రవికిరణ్ రెడ్డిని జైళ్ల శాఖ డీఐజీగా నియమించారని పేర్కొన్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ బంధువు బాబ్జీ. ఈయన వైద్యశాఖ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. బాబ్జీ.. జైలు డాక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించారు. అందుకే చంద్రబాబు ఏసీబీ న్యాయమూర్తికి లేఖ రాసినట్టు ఆరోపించారు. ఇప్పుడు వైసీపీ ఎంపీ గోరంట్ల మాదవ్ చేసిన వ్యాఖ్యలు తమ అనుమానాలను బలపరుస్తున్నాయని పేర్కొన్నారు ధూళిపాళ్ల.

Read more RELATED
Recommended to you

Exit mobile version