వాల్తేరు డివిజన్ తో కూడిన రైల్వే జోన్ ఏర్పడుతుంది : ఎంపీ జీవీఎల్

-

వాల్తేరు డివిజన్ తో కూడిన రైల్వే జోన్ ఏర్పడుతుంది రాజ్యసభ ఎంపీ జీవీఎల్ నరసింహా రావు వెల్లడించారు. ఇవాళ ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ముఖ్యంగా రైల్వే జోన్ నిర్మాణం జరుగుతుందని.. రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని వెల్లడించారు. బిజెపి నాయకత్వం నిరంతర ప్రయత్నాలు ఫలితంగా కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కంట్లో కారం కొడితే విభజన హామీలను 100 శాతం పూర్తి చేసింది బిజెపి ప్రభుత్వమే అని ఎంపీ జీవీఎల్ నరసింహా రావు స్పష్టం చేశారు.

రైల్వే జోన్ భూములపై వివాదం జరుగుతున్న సమయంలో బిజెపి రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఈ గుడ్ న్యూస్ చెప్పారు. వాల్తేరు డివిజన్ తో కూడిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ని ఏర్పాటు సాకారం అవుతుందని చెప్పారు. ఉత్తర ఆంధ్రా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ఒక్క బీజేపీ నాయకత్వం తోనే సాధ్యం అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version