ఈవీఎంలపై వైసీపీ సీనియర్ నేత సంచలన వ్యాఖ్యలు

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈసారి ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి ఆశించిన మెజార్టీ రాలేదు. కానీ ఎన్డీఏ కూటమితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక అలాగే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి భారీ విజయం సాధించాయి. అధికార వైసీపీ కేవలం 11 సీట్లకు పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కకపోవడం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఏపీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందిన విషయం తెలిసిందే. ఈ ఓటమి పై వైసీపీ నేతలు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత రవీంద్రనాథ్ రెడ్డి ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. సింగపూర్ నుంచి ఈ కుట్ర జరిగిందా? మరో చోట నుంచి చేశారా? అనేది త్వరలోనే తేలుతుందని అన్నారు. అయితే ఆయన వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. గతంలో వైసీపీ గెలిచినప్పుడు కూడా ఇలాగే చేశారా అని కౌంటర్ ఇస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version