AP : ఇవాళ అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనున్న ఏపీ సర్కార్

-

AP : ఇవాళ అసెంబ్లీలో 3 బిల్లులు ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్. ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ మూడో రోజు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతాయి. ఉదయం 9 గంటలకు సమావేశం కానుంది ఏపీ అసెంబ్లీ. వివిధ శాఖల చెందిన యాన్యువల్ నివేదికలను సభ ముందు పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. ఇవాళ ఉదయం 11 గంటల 3 నిమిషాలకు 2024-25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సభలో ప్రవేశపెట్టనున్నారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్.

The AP government will introduce 3 bills in the assembly today

మూడు నెలల కాలానికి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పని చేస్తుంది. అలాగే, ఇవాళ్టి అసెంబ్లీ సభలో మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024, ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు)మూడు బిల్లులను ప్రవేశపెట్టనుంది ఏపీ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Exit mobile version