ఏపీలో వైసీపీ గెలిచే మొదటి స్థానం కుప్పమే – గుడివాడ అమర్నాథ్

-

ఏపీలో వైసీపీ గెలిచే మొదటి స్థానం కుప్పమేనని.. టీడీపీ రెఫరెండం డిమాండ్‌కు గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమం, అభివృద్ధి వికేంద్రీకరణ వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా రిఫరెండం అవుతాయని… రాజ్యాంగం ప్రకారం ఐదు ఏళ్ళకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు.

ప్రజలు మాకు ఐదేళ్ళకు తీర్పు ఇచ్చారు.. మేం అసెంబ్లీ ఎందుకు రద్దు చేయాలి ?? అని ప్రశ్నించారు. ఓడిపోవడానికి చంద్రబాబుకు తాపత్రయం ఎందుకు?? అని చురకలు అంటించారు. ఎవరికైనా గెలవటానికి తాపత్రయం ఉండాలన్నారు.

ముందు కుప్పంలో ఎలా గెలవాలో చంద్రబాబు చూసుకుంటే మంచిదని.. మేము రాష్ట్రంలో గెలిచే మొదటి స్థానం కుప్పం అని వివరించారు. చంద్రబాబు సభకు రానని మంగమ్మ శపధాలు చేస్తాడని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం సభకు వస్తారన్నారు. చంద్రబాబు మాట ఎమ్మెల్యేలు వినటం లేదో వాళ్ళ మాట చంద్రబాబు వినటం లేదో అర్థం కాదని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version