ఎన్టీఆర్ జిల్లాలో క్వారీలో ఘోర ప్రమాదం… ముగ్గురు దుర్మరణం

-

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాల క్వారీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీ పైనుంచి లూజు బోల్డర్స్ పెద్ద మొత్తంలో జారి డ్రిల్లింగ్ వేస్తున్న కార్మికులపై పడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులు దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీమ్ తో ఘటనాస్థలికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టి బోల్డర్స్, పెద్ద పెద్ద రాళ్ల కింద ముగ్గురు కార్మికులు చిక్కుకున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ‘పరిటాల క్వారీలో క్వారీ పై నుంచి బోల్డర్స్ జారి కార్మికులపై పడటంతో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయినట్లు మాకు సమాచారం అందింది. మరో ముగ్గురు రాళ్ల కింద చిక్కుకున్నారు. వారి కోసం రెస్క్యూ టీమ్ గాలిస్తోంది.  మృతులు జి.కొండూరు మండలం చెరువు మాధవరం గ్రామానికి చెందినవారిగా గుర్తించాం. బోల్డర్స్ జారి పడటం వల్ల ఈ ఘటన జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ చేపడతాం. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్నాం. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకుని త్వరలోనే వెల్లడిస్తాం.’ అని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version