శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పు.. టీటీడీ క్లారిటీ ఇదే

-

తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది. ఇదంతా తప్పుడు ప్రచారం అని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదంలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోందని.. అది పూర్తిగా అసత్యమని అధికారులు స్పష్టం చేశారు.

ఇటీవల అర్చకులు, ఆలయ అధికారులతో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమావేశంలో స్వామి వారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని అధికారులు వెల్లడించారు . అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. కానీ.. అన్న ప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ అధికారులు సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version