కొడాలి నానిపై వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు..పదవులు ఎప్పటికీ ఉండవ్ !

-

కొడాలి నానిపై వంగవీటి రాధా సంచలన వ్యాఖ్యలు చేశారు. పదవులు ఎప్పటికీ ఉండవనిచురకలు అంటించారు వంగవీటి రాధా. రంగా ఓ ప్రాంతానికో.. కులానికో.. పార్టీలకో పరిమితం కాదు…అందుకే పార్టీలేమైనా.. ఈ కార్యక్రమానికి వచ్చానని చెప్పారు.

రంగా చనిపోయి 34 ఏళ్లు అవుతున్నా.. తమ నాయకుడు రంగా అనే చెబుతారు.రంగా హత్య జరిగిన సమయంలో పుట్టని వారు కూడా రంగాను తమ నాయకుడిగా భావిస్తున్నారన్నారు. ఎన్నేళ్లు పదవిలో ఉన్నామని కాదు.. ప్రజల గుండెల్లో ఎన్నాళ్లు నిలిచామనేదే ముఖ్యమన్నరు.

 

పదవులు గురించి కొడాలి నాని ఏదో చెప్పారు…పదవులు ఐదేళ్లు ఉంటాయి.. ఆ తర్వాత పోతాయని పేర్కొన్నారు. రంగా గారి అబ్బాయినేదే నాకు పెద్ద పదవి…ఓ సామాన్యుడిగా అందరితో కలిసి ఉండడమే నాకిష్టమని కుండ బద్దలు కొట్టి చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version