మాజీ మంత్రి, వైస్సార్సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో ఇవాళ (ఏప్రిల్ 7వ తేదీ 2025) విచారణ జరిగింది. కేవలం రాజకీయ కక్షతోనే కేసు నమోదు చేసినట్లు కాకాణి తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపగా.. పోలీసుల తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కాకాణి పలువురిని బెదిరించారని న్యాయస్థానానికి వివరించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది.
వైస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పొదలకూరు మండలంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి, అక్రమంగా క్వార్జ్ ఖనిజాన్ని తవ్వి తరలించారంటూ కాకాణిపై కేసు నమోదైంది. మైనింగ్ అధికారి బాలాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఫిబ్రవరి 16వ తేదీన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు పోలీసులు కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. విచారణ నిమిత్తం కాకాణికి పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ప్రతిసారి ఆయన ఇంట్లో ఉండటం లేదు. ప్రస్తుతం గోవర్ధన్రెడ్డి పరారీలోనే ఉన్నారు. అతడి ఆచూకీ కోసం హైదరాబాద్లో నెల్లూరు పోలీసులు వెతుకుతున్నారు.