చంద్రబాబు అసత్య హరిచంద్రుడు : ఎంపీ విజయసాయి రెడ్డి 

-

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అసత్య హరిచంద్రడు అని ఎంపీ విజయసాయి రెడ్డి  పేర్కొన్నారు. బాపట్లలో మీడియాతో మాట్లాడారు. బాపట్ల జిల్లాలోని ఆరు నియోజకర్గాలు  వైసీపీకి వస్తాయి అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  చంద్రబాబు నాయుడు ప్రతీ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నా కూడా వైసీపీ సొంతంగా పోటీ చేసి గతంలో ఎన్నిస్థానాలు వచ్చాయో వాటిని తగ్గకుండా టీడీపీ, బీజేపీలకు బుద్ది చెబుతాం. తెలుగు దేశం పార్టీ తెలుగు దొంగల పార్టీ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

తెలుగు పార్టీ నేతలు అధికారం కోసం దేశద్రోహానికి పాల్పడటానికి అవకాశం ఉంది. దేశ వ్యతిరేక శక్తులకు చేతులు కలుపుతున్నారు. పోలీసులపై దాడి చేసిన తెలుగుదేశం పార్టీ ద్రోహుల పార్టీ కాక ఏమవుతుందని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడికి ఏపీలో స్థిర నివాసం లేదన్నారు. చంద్రబాబు తనకు తాను సింహం అనుకుంటారు. ఆ సింహం ప్రస్తుతం గర్జించే స్థితిలో లేదన్నారు. 2024లో చంద్రబాబు నాయుడు కథ ముగుస్తుంది. ఆయన కల చెరిగిపోతుంది. ఒక్కసారి టైమ్స్ నౌ, ఇండియా టుడే సర్వేల్లో ఏమి వచ్చిందని చంద్రబాబు, లోకేష్ తెలుసుకోవాలి. సర్వేలో 24 ఎంపీ స్థానాలు వైసీపీ కైవసం చేసుకుంటుందని వెల్లడైంది. 

Read more RELATED
Recommended to you

Exit mobile version