శపథం చేసినా.. ఏపీ అసెంబ్లీకి చంద్రబాబు..విజయసాయి సెటైర్లు

-

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేసిన సంగతి తెలిసిందే. నిండు సభలో తన కుటుంబ సభ్యులపై కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ.. ఓ దశలో కంటతడి కూడా పెట్టారు. దీంతో సభకు నమస్కారం పెట్టి చంద్రబాబు అసెంబ్లీ నుండి బయటకు వెళ్లిపోయారు. అయితే విమర్శలు, ప్రతి విమర్శలు ఎన్నో సార్లు చూశాం అని, కానీ వ్యక్తిగతంగా తన భార్య, కుటుంబ సభ్యులపై చేసిన విమర్శలతో కలత చెందానని, అందుకే మళ్లీ సీఎం అయ్యాకే సభలో అడుగు పెడతానని గతంలో అన్నారు చంద్రబాబు.

అయితే తాజాగా.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఓటు వేయడానికి అసెంబ్లీ లోకి వచ్చారు చంద్రబాబు నాయుడు. ఈ వీడియోని షేర్ చేస్తూ వైయస్సార్సీపి ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు.” సీఎం అయ్యేదాకా అసలు అసెంబ్లీ గడప తొక్కనని మంగమ్మ శపథం చేశాడు.. ఆ ఒట్టు తీసి కరకట్ట గట్టున పెట్టేసి అసెంబ్లీకి వెళ్లి ఓటు వేశాడు బాబు. ఇక సీఎం కాలేనన్న క్లారిటీ ఆయనకు ఉంది. పచ్చ కుల మీడియా మాత్రం పిచ్చిగా చెలరేగుతోంది.” అంటూ ట్వీట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version