విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ కొనసాగుతోంది. విశాఖలో వాటర్ ఎమర్జెన్సీ కారణంగా దాదాపు 3 లక్షల ఇంటి కులాయిలకు నిలిచింది నీటి సరఫరా. 30 గంటలుగా పంపింగ్ వ్యవస్థ స్తంభించింది. ఏలేరు, తాటిపూడి, గంభీరం, రైవాడ కెనాల్స్ నుంచి వచ్చే నీళ్లను నిలిపి వేశారు ఉద్యోగులు. ఇప్పటికే GVMC పరిధిలోని అన్ని ట్యాంకులు ఖాళీ అయినట్లు సమాచారం అందుతోంది.

తిరిగి ట్యాంక్ లు నింపాలంటే సుమారు 10 గంటల సమయం పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే జరిగితే సాంకేతిక సమస్యలు తప్పవంటున్నారు వాటర్ సప్లయ్ ఉద్యోగులు. సచివాలయ ఉద్యోగులతో ట్యాంకులు నింపాలని చూస్తున్నారు GVMC అధికారులు. నిన్న రాత్రి వరకు జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మె కొనసాగిస్తున్నారు ఉద్యోగులు.