ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామో త్వరలోనే చెప్తాం – నాదెండ్ల మనోహర్

-

జనసేన – బిజెపి – టిడిపి పార్టీల మధ్య పొత్తులు ఉంటాయని మరోసారి చెప్పగానే చెప్పేశారు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. సోమవారం గుంటూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జనసేన అన్ని స్థానాలలో పోటీ చేయడం లేదని సంకేతాలు ఇచ్చారు. జనసేన ఎన్ని స్థానాలలో పోటీ చేయబోతుందో త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జనసేన ని బలోపేతం చేసే దిశగా కార్యకర్తలతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నామని అన్నారు నాదెండ్ల మనోహర్. వాలంటీర్ల ద్వారా వ్యవస్థకు జరుగుతున్న నష్టాలపై ప్రశ్నించినందుకు పవన్ కళ్యాణ్ పై ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని ఆరోపించారు. డేటా చోరీపై పవన్ నిలదీస్తున్నందుకే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సీఎంవోలో భారీగా డబ్బు చేతులు మారుతోందని. దీనిపై విచారణ కమిటీ వేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version