‘అవినీతిపురుష్’ అని టీడీపీ.. ‘వెన్నుపోటు బాగోతం’ అంటూ వైసీపీ ట్వీట్లు

-

సోషల్ మీడియాలో వైసిపి, టిడిపి మధ్య ట్వీట్ల వార్ కొనసాగుతోంది. ‘ధర్మం కోసం అన్నవెంట నడిస్తే అది ఆది పురుష్ కథ. బాబాయ్ ని లేపేసి తమ్ముడిని కాపాడితే అది అవినీతి పురుష్ కథ’ అని టిడిపి చేసిన ట్వీట్ కు వైసిపి కౌంటర్ ఇచ్చింది. ‘లోక కళ్యాణం కోసం కృష్ణుడు మేనమామను చంపడం మహాభారతం అయ్యింది. అదే బాబు పదవి కోసం పిల్లనిచ్చిన మామను పొడవడం వెన్నుపోటు బాగోతం అయింది’ అని వైసిపి రిప్లై ఇచ్చింది.

ఇది ఇలా ఉండగా అటు నాకు వైసీపీ నుంచి ప్రాణహాని ఉందంటూ జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన కార్యవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ ఈ కామెంట్స్ చేశారు. నాకు ప్రాణహాని ఉంది, ప్రత్యేక సుఫారీ ఇచ్చారని వెల్లడించారు. నేను బ్రతికి ఉండాలి కాబట్టి సెక్యూరిటీ అన్నారు. వాళ్లకు ఇబ్బంది ఉన్నప్పుడు నన్ను బ్రతకనిస్తారా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌. 2019 లో వైసిపి రాకపోతే పవన్ కళ్యాణ్ ని చంపేద్దామని అనుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version