వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే- వైఎస్‌ వివేకా PA

-

వివేకా హత్య.. సునీత దంపతుల కుట్రే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి. వారిద్దరితోపాటు శివప్రకాశ్‌రెడ్డిల తీరు సందేహాస్పదమని…వివేకా రెండో పెళ్లితోనే ఆ కుటుంబంలో తీవ్ర విభేదాలు ఉండేవని చెప్పారు. రెండో భార్య షమీమ్‌కు ఆస్తిలో వాటా ఇవ్వాలని వివేకా భావించినట్లు వెల్లడించారు.

YS Vivekananda Reddy PA MV Krishna Reddy comments viral

వివేకా లెటర్‌ను దాచిపెట్టమని అల్లుడు రాజశేఖర్‌రెడ్డి చెప్పారు…అబద్ధం చెప్పాలని సునీత, రాజశేఖర్‌రెడ్డి నన్ను వేధించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి.ఎంపీ అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి పేర్లు చెప్పాలని ఒత్తిడి తెచ్చారని… పోలీసులు, సీబీఐ అధికారులు చిత్రహింసలకు గురిచేశారని పేర్కొన్నారు.

నేను అబద్ధం చెప్పకపోతే నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి…జైలుకు వెళ్లాల్సి వస్తుందని సునీత అన్నారన్నారు వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి. దస్తగిరి అప్రూవర్‌గా మారడం వెనుక పక్కా కుట్ర ఉందని…అవినాశ్‌రెడ్డిని ఎంపీగా గెలిపించడం కోసం చివరి వరకూ వివేకా కృషిచేశారన్నారు వైఎస్‌ వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version