ఏపీ కరోనా అప్డేట్.. జిల్లా వారీగా కేసుల వివరాలివే

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కేసులు క్రమంగా తగ్గు ముఖం పడుతున్నాయి. అయితే ఇప్పుడు మళ్ళీ కేసులు పెరిగాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,292 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 739719కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 42 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6128కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 48661 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ap-corona

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 684930కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 66,944 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటిదాకా 63,49,953 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 362, చిత్తూరులో 784, తూర్పు గోదావరిలో 652, గుంటూరులో 493, కడపలో 323, కృష్ణాలో 399, కర్నూలులో 175, నెల్లూరులో 311, ప్రకాశంలో 591, శ్రీకాకుళంలో 204, విశాఖపట్నంలో 198, విజయనగరంలో 188, పశ్చిమ గోదావరిలో 612 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version