గుడ్ న్యూస్ : ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

-

ఏపీలో కొద్ది రోజులుగా కరోనా కేసులు కాస్త భారీగానే నమోదవుతున్న సంగతి తెలిసిందే. నిన్న కాస్త మళ్ళీ పెరిగిన కరోన కేసులు ఈ రోజు నిన్నటి కంటే బాగా తగ్గాయి. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2918 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 7,86,050కి పెరిగింది. ఒక్కరోజు వ్యవధిలో మరో 24 మంది చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 6,453కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 35,065 యాక్టివ్‌ కరోనా కేసులు న్నాయి.

ap-corona

ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 7,41,637కు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 61,330 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 71,27,533 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 218, చిత్తూరులో 380, తూర్పుగోదావరి జిల్లాలో 468, గుంటూరులో 333, కడపలో 155, కృష్ణాలో 117, కర్నూలులో 66, నెల్లూరులో 119, ప్రకాశంలో 308, శ్రీ కాకుళంలో 143 విశాఖపట్నంలో 120, విజయనగరంలో 44, పశ్చిమ గోదావరిలో 447 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version