ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా.. కొత్తగా 6,213 కేసులు నమోదు

-

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో కొత్తగా కేవలం… 6,213 క‌రోనా కేసులు.. నమోదు అయ్యాయి. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌  రాష్ట్రం లో మొత్తం కరోనా మహమ్మారి పాజిటివ్‌ కేసుల సంఖ్య 2282583 కి పెరిగింది.కోవిడ్ వల్ల చిత్తూరు, గుం టూరు, నెల్లూరు, ప్రకాశం మరియు విశాఖపట్నం లలో ఒక్కొక్క రు చొప్పున మరణించారు.

ap carona

దీంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14620 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 105930 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 10,795 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2162033 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 35,035 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 3,25,05,747 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version