ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆయన పదవికాలం పొడిగింపు..

-

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల ప్రభుత్వ సలహాదారు పదవి కాలాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఇప్పుడు.. ఏపీ ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్‌గా కొన‌సాగుతున్న కె.హేమ‌చంద్రారెడ్డి ప‌దవీ కాలాన్ని పొడిగిస్తూ ఏపీ ప్ర‌భుత్వం బుధ‌వారం నిర్ణ‌యం తీసుకుంది. హేమ‌చంద్రారెడ్డి ప‌ద‌వీ కాలాన్ని ఏకంగా మూడేళ్ల పాటు పొడిగిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

ఈ పొడిగింపుతో 2025 జూన్ 26 వ‌ర‌కు ఆయ‌న ఉన్న‌త విద్యా మండ‌లి చైర్మ‌న్‌గా కొన‌సాగ‌నున్నారు. వాస్త‌వానికి ఈ నెల 25తో హేమ‌చంద్రారెడ్డి ప‌ద‌వీ కాలం ముగియ‌నుంది. అయితే ఈ గ‌డువుకు ముందే ఆయ‌న ప‌ద‌వీ కాలాన్ని పొడిగిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version