BREAKING : ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల..

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐసెట్ మరియు ఈసెట్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఐసెట్ మరియు ఈసెట్ పరీక్ష ఫలితాలను కాసేపటి క్రితమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. అయితే ఈసెట్ పరీక్ష ఫలితాలలో… ఏకంగా 29, 904 మంది ఉత్తీర్ణులు అయ్యారు.

అలాగే ఐసెట్ పరీక్షా ఫలితాలలో 34, 789 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఈసెట్ పరీక్ష ఫలితాలలో 92.53 శాతం మంది విద్యార్థులు ఉత్తీ ర్ణత సాధించారని అలాగే ఐసెట్ పరీక్షా ఫలితాలలో 91.27 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇక sche.ap.gov.in లో  ఈ పరీక్ష ఫలితాలు అందుబాటు లో ఉండనున్నట్లు వెల్లడించారు మంత్రి ఆదిమూలపు సురేష్. పరీక్ష ఫలితాలపై ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా.. ప్రభుత్వం అధికార వెబ్ సైటు ద్వారా తెలపాలని ఆయన వివరించారు.  కాగా సెప్టెంబరు 17, 18 తేదీ ల్లో పరీక్షలను నిర్వహించింది ఏయూ.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version