పవన్‌ ఒక్కసారైనా దాని గురించి మాట్లాడాడా? : మంత్రి వేణుగోపాల కృష్ణ

-

జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌పై మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ మండిపడ్డారు. పవన్‌ పూటకో వేషం వేస్తున్నారని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారని విమర్శించారు. చంద్రబాబు వల్ల పుష్కరాల్లో 29 మంది చనిపోతే పవన్‌ ఒక్కసారైనా మాట్లాడారా? అని ప్రశ్నించారు. శనివారం మీడియాతో వేణుగోపాల కృష్ణ మాట్లాడుతూ.. పవన్‌ స్థిరత్వం లేని వ్యక్తి అని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని ఆశించలేదంటారని, తర్వాత ఇస్తే తీసుకుంటానంటారని హేళన చేశారు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ మాట్లాడలేని వ్యక్తి పవన్‌ అని మండిపడ్డారు.

జనసేన కార్యకర్తలపై పవన్ బండరాయి వేస్తున్నాడని మంత్రి వేణు పేర్కొన్నారు. కుల ప్రస్తావన లేకుండా ఏ సభలోనూ పవన్ మాట్లాడలేడని దుయ్యబట్టారు. చిరంజీవి కష్టపడి సంపాదించిన ఇమేజ్‌.. పవన్‌కి లభించిందని ఎద్దేవా చేశారు. పవన్‌.. పిఠాపురంలో నీవు మాట్లాడిన ధర్మ పరిరక్షణ వల్లించిన సూక్తులు ఏనాడైనా పాటించావా? అని నిలదీశారు. ధర్మభక్షణ చేసే వ్యక్తి పక్కన నువ్వున్నావంటూ.. పరోక్షంగా చంద్రబాబుపై కౌంటర్ వేశారు. పవన్‌ సినిమాల్లో హీరో కావచ్చేమో గానీ.. రాజకీయాల్లో మాత్రం జీరో అని ప్రజలకు అర్థమైందని చురకలంటించారు. గోదావరి జిల్లాలో నీ సామాజిక వర్గానికి సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నావ్ పవన్? అని అడిగారు. రైతులకు, మహిళలకు, చిన్నారులకు, విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు అందిస్తోందని.. ఇవేవీ నీకు కనిపించడం లేదా? అని ప్రశ్నించారు. నారాహి యాత్రను ప్రజలు ఏమాత్రం పట్టించుకోరంటూ సెటైర్లు వేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version